మహబూబాబాద్ : సఖి సెంటర్లో ట్రాన్స్ జెండర్ హెల్ప్ డెస్క్ ను ప్రారంభించామని జిల్లా సంక్షేమ అధికారిని జే.ఎం. స్వర్ణలత లెనిన తెలిపారు. మంగళవారం జిల్లా మహిళా – శిశు సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో సఖి-సెంటర్లో ట్రాన్స్ జెండర్ helpdesk ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కమిషనర్ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆదేశానుసారం ట్రాన్స్ జెండర్ హెల్ప్డెస్క్ను ప్రారంభించామని తెలిపారు.
ఎలాంటి సమస్యలు ఉన్నా హెల్ప్ డెస్క్ లో చెప్పాలని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా కృషి చేస్తామన్నారు. జీవనోపాధికి తోడ్పాటునందించేందుకు వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు. ఎవరైనా చదువుకొని ఉద్యోగం చేయాలనీ ఆసక్తి ఉన్నవారికి డిపార్టుమెంటు తరపున సహాయం చేస్తామని ఆమె పేర్కొన్నారు.