మహబూబాబాద్, ఏప్రిల్, 25 : మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గిఫ్ట్ ప్యాకెట్లను సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముస్లింలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. పేదవారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో మహబూబాబాద్ ఎలా ఉన్నది, ప్రస్తుతం ఎలా వున్నది పరిశీలన చేసుకోవాలన్నారు.
అభివృద్ధిని గుర్తించి ఆధరించాలన్నారు. మాట్లాడుతూ, కార్యక్రమంలో ఆర్డీవో కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు పాషా, మైనారిటీ వెల్ఫేర్ అధికారి బి. శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.