మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు పాల్గొని ముందుగా కేక్ కట్ చేశారు.
అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కురవి మండల జడ్పీటీసీ బండి రెడ్డి, సొసైటీ చైర్మన్ ముళ్ల మధుకర్ రెడ్డి,అనిల్ రెడ్డి, డాక్టర్ సుందర్ నాయక్, బోడ శ్రీను నాయక్, మన్యు, సూర్య, సురేష్ నాయక్, ఉన్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేశారు.