మహబూబాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కేసముద్రం మండలంలోని క్యాంపు తండాలో భీమా నాయక్ అనే రైతు అడవి పందుల బారి నుంచి మొక్కజొన్న చేనును కాపాడుకునేందుకు మొక్కజొన్న చేనుకి రక్షణగా విద్యుత్ తీగ అమర్చాడు.
శనివారం సాయంత్రం మంగ్య నాయక్ అనే మరో రైతు గడ్డి కోయడానికి వెళ్లి విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భీమానాయక్ మరో రైతు సహకారంతో మృతదేహాన్ని ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో పడేశాడు.
స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. కెనాల్ కాలువలో కొట్టుకుపోయిన మృతదేహాన్ని పోలీసుల సహకారంతో రాత్రి నుంచి గాలించగా తాళ్ల పూసలపల్లి సమీపంలోని కెనాల్ కాలువలో లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.