హనుమకొండ చౌరస్తా, మార్చి 6 : వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలను గురువారం నుంచి నిర్వహించనున్నట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజలు చేసి, ఐదురోజుల బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకాలు, సాయంత్రం కల్యాణోత్సవం ఉంటుందని, రాత్రి 12 గంటలకు లింగోద్భవకాల సమయంలో 112 రుద్రాలతో లింగోద్భవకాలపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు.
శివరాత్రి రోజు కల్యాణమండపాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొని పునఃప్రారంభించనున్నట్లు వివరించారు. మహాశివరాత్రి ఉత్సవాల కోసం అన్ని శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్యూలైన్స్, చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం, వలంటీర్ల సేవలు, విద్యుత్ అలంకరణ చేపట్టినట్లు ఈవో వెంకటయ్య వివరించారు.