కాళేశ్వరం, మార్చి 6 : కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దేవస్థానం మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. తెలంగాణ సహా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి సుమారు 3.50 లక్షల మంది భక్తులు దర్శనానికి రానున్న నేపథ్యంలో ఆలయ అధికార గణం ఏర్పాట్లు చేస్తోంది. నేటి నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనుండగా ఇప్పటికే రంగురంగుల విద్యుద్దీపాలతో ఆలయాన్ని అలంకరించారు.
జాగారం ఉండే భక్తులకు కాలక్షేపం కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం హనుమాన్ గుడి సమీపంలోని ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించారు. అలాగే వీఐపీలకు దేవస్థానం పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించారు. దివ్యాంగుల కోసం నేరుగా గోదావరి నది వద్దే వాహన పార్కింగ్కు అవకాశం కల్పించారు.