న్యూశాయంపేట, సెప్టెంబర్ 24 : వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ఇందిరమ్మ కాలనీ ఇంకా నీటిలోనే ఉంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బంధం చెరువు మత్తడిను గుర్తుతెలియని దుండగులు గండి కొట్టడంతో ఇందిరమ్మ కాలనీ ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి.
పారిశుధ్య సిబ్బంది బురదను చెత్తను తొలగించకపోవడంతో బస్తీలన్నీ దుర్గందంగా మారాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని గ్రేటర్ పరిధి 49వ డివిజన్లోని ఇందిరమ్మకాలనీలో రెండురోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేనిపరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడంలేదని, ఇదేనా ప్రజాప్రభుత్వం తీరు అని కాలనీ వారు నిలదీస్తున్నారు.