ఎల్కతుర్తి, అక్టోబర్ 2 : మహిళా స్వశక్తి సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు రూ.37లక్షలతో ఎల్కతుర్తిలో నిర్మించిన మండల శ్రీశక్తి భవనాన్ని మంగళవారం జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్తో కలిసి ఎమ్మెల్యే సతీశ్కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని సంక్షేమ పథకాల్లో మహిళలకే పెద్దపీట వేశారన్నారు. మండలంలో గృహలక్ష్మి కింద 2160 మంది అర్హులు ఉంటే ఇందులో 360 గృహాలు మొదటి విడతగా మంజూరయ్యాయని తెలిపారు. మండలంలో ఇప్పటివరకు కల్యాణలక్ష్మి కింద 1622 మందికి రూ.14.74కోట్లు అందించినట్లు వివరించారు. సీఎం కేసీఆర్ గొప్ప దార్శనీకుడని, ఆయన సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మహిళల దీవెనలు కావాలని కోరారు.
రుణాల పంపిణీ, శంకుస్థాపనలు
మండలంలోని దామెర, కోతులనడుమ, దండేపల్లి, సూరారం గ్రామాల్లో రోడ్డు పనులకు శంకుస్థాపనతో పాటు ఎల్కతుర్తిలో శ్రీశక్తి భవనాన్ని ఎమ్మెల్యే సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతలపల్లి మీదుగా దామెర వరకు రూ.1.50కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు, దామెర నుంచి సోమదేవరపల్లి వరకు రూ.46లక్షలతో నిర్మించే రోడ్డు, కోతులనడుమ నుంచి వీరనారాయణపూర్ వరకు రూ.63లక్షలతో బీటీ రోడ్డు రెన్యువల్, దండేపల్లిలో రూ.కోటితో నిర్మించే సీసీ రోడ్డు, సూరారంలో రూ.37లక్షలతో నిర్మించే బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు రూ.2 కోట్ల రుణాలను అందజేశారు.
కాగా, మహిళలు గ్రామైక్య సంఘా ల భవనాలు కావాలని ఎమ్మెల్యేను కోర గా స్థలాలు ఉన్న అందరికీ రెండు రోజుల్లో రూ.10 లక్షలతో భవనాలను మం జూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయా గ్రామాల్లో పలువురు బాధితులను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, రైల్వే బోర్డు మెం బర్ ఎల్తూరి స్వామి, రైతుబంధు కో ఆర్డినేటర్ పోరెడ్డి రవీందర్రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, సొసైటీ వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, ఎంపీడీవో తూర్పాటి సునీత, ఐకేపీ ఏపీఎం రవీందర్, పీఆర్ ఏఈ ప్రణవ్, సర్పంచ్లు కొమ్మిడి నిరంజన్రెడ్డి, బోయినపల్లి రజిత, చదిరం వసంత, పుట్ట ప్రమీల, కుర్ర సాంబమూర్తి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, వేముల రజిని, గొర్రె ఆదాం, చెవుల కొమురయ్య, గ్రామై క్య సంఘం మండల అధ్యక్షురాలు స్వర్ణలత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, నాయకులు గొల్లె మహేందర్, పిట్టల మహేందర్, దేవేందర్రావు, గుండా ప్రతాప్రెడ్డి, లోకిని సూ రయ్య, అల్లకొండ రాజు, హింగె శివాజీ, మేకల కోమల, గొడిశాల వినయ్, శ్రీకాంత్యాదవ్, మహిపాల్రెడ్డి, రవీందర్రావు, సాతూరి వెంకన్న పాల్గొన్నారు.