హనుమకొండ, జూన్ 30 : కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు దకాల్సిన విభజన చట్ట హామీల సాధనకు కలిసి ఉద్యమిద్దామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, నిర్మా ణ పనుల్లో వేగం పెరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పార్టీ పరం గా పోరాడాలని దాస్యం ఎంపీకి సూచించారు.
ఉమ్మడి వరంగల్ ప్రజల 40 ఏళ్ల కలను సాకారం చేసేందుకు, స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కేలా కృషి చేద్దామన్నారు. కేంద్రీయ విద్యాసంస్థలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొల్పేలా బీజేపీ ప్రభుత్వంపై పోరాడుదామని ఆయన సూచించారు. మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కేంద్రం వేగంగా చర్యలు చేపట్టేం దు కు అవసరమైన కార్యాచరణకు సిద్ధమవుదామని చర్చించారు. కాజీపేట మండలం కడిపికొండ గ్రామ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయించాలని దాస్యం కోరారు.