రైతులు వేసిన పంటలే మళ్లీ వేయడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. చాలా మంది నేటికీ ఒకే రకమైన పంటలను పండిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే దిగుబడులు పెరగడంతోపాటు నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూసారం వృద్ధి చెందుతుంది. చీడపీడల బెడద తగ్గుతుంది. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే పురుగు మందు ఖర్చు తగ్గుతుంది. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ధర పొందే అవకాశం ఉంది. పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
వ్యవసాయ రంగంలో పంట మార్పిడి విధానంతో పురుగుల ఉధృతి తగ్గడమే కాకుండా భూసార సంరక్షణ, పోషక లోపాల నివారణ జరిగి రైతులు అధిక దిగుబడులు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాలా మంది రైతులు దీన్ని పాటించకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రతి ఏటా పంట మార్పిడి విధానాన్ని అవలంబించినట్లయితే నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలు ఉంటుంది. భూమిలోని పోషకాలు సమృద్ధ్దిగా అందుతాయి. ఈ విషయాలన్నింటిని వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పుడూ ఒకే పంటను పండించడంతో పురుగులకు నిరంతరం ఆహారం లభ్యమై వాటి జీవిత చక్రం పునరావృతం అవుతూ వాటి సంతతి పెరు గుతుంది. దీంతో పంటలకు చీడ, పీడల బెడద ఎక్కువవుతుంది.
ఒకే పంట పండించడంతో ఆ పంట వేర్లు నేలలో వ్యాపించి పోషకాలను గ్రహించడంతో కొన్ని రోజులకు ఆ మట్టి పొరలు విస్తారం అవుతాయి. అలాంటి నేలల్లో వేసే పంటల దిగుబడులు తగ్గిపోనున్నాయి. వివిధ వేరు వ్యవస్థ కలిగిన పత్తి, కంది, వంటి పంటలు, మామూలు వేరు వ్యవస్థ గల(స్వల్ప, లోతుకు చొచ్చుకుపోయే) వరి, వేరుశనగ వంటి పంటలతో మార్పిడి చేయాలి. నీటి వసతి సరిగా లేని ప్రాంతంలో ఒక పంటను పూర్తి నీటి వసతితో పండించి 2వ పంటను వర్షాధారంగా వేసుకుంటే నీటి వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది. మిరప, టమాట, వేరుశనగ పంటలను ఆశించే లద్దె పురుగు నివారణకు జొన్న, వరి, సజ్జ, రాగి పంటలతో మార్పిడి చేసుకోవాలి. పంట మార్పిడి చేయడంతో పొలంలో పురుగులు, ప్రాణాంతక తెగుళ్లు వృద్ధి చెందడానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. పంట మార్పిడి చేయడంతో నేలలోని మట్టి సారవంతమవడంతో పాటు మట్టి ఉత్పాదకత స్థిరంగా కాపాడుకోవచ్చు.
పంట మార్పిడి విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పంటల మార్పిడితో ప్రయోజనాలివే..
ఈ విధానంలో చేయనివి..