వరంగల్ : 11 న జనగాంలో జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్లోని రాజశ్రీ గార్డెన్స్ లో స్థానిక ఎటీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నా గెలుపునకు కృషి చేసిన ఏ ఒక్కరిని ఎప్పటికి మర్చిపోను అన్నారు. అందరికి విధేయతతో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాని తెలిపారు.
కాగా, ఈ నెల 11 న జనగాంలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.