వరంగల్ చౌరస్తా, జనవరి 2 : క్షయ వ్యాధి నియంత్రణాధికారి కార్యాలయంలో ప్రోగ్రాం వివరాలను జాతీయ క్షయ నియంత్రణ పోర్టల్లో నమోదు చేయడానికి వినియోగించే ల్యాప్ట్యాప్ కనిపించకుండా పోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా క్షయ నియంత్రణాధికారిగా పొట్ల సత్యసోమ మల్లికార్జున్ 2022 నవంబర్ 18న మహబూబ్నగర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో ఆయన తాత్కాలికంగా బాధ్యతలను ప్రదీప్రెడ్డికి అప్పగించి వెళ్లారు. అప్పటి నుంచి ల్యాప్టాప్ కనిపించడం లేదు. దీంతో టీబీ కంట్రోలర్ జిల్లా వైద్యాధికారి సాంబశివరావుకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పం దించి, చర్యలు తీసుకొని ప్రభుత్వ వైద్య సేవలకు వినియోగించే ట్యాప్ట్యాబ్ను గుర్తించి సేవలను మెరుగుపరచాలని పలువురు కోరుతున్నారు.