విద్యార్థులకు చదువుతో పాటు కళలను నేర్పుతున్నాయి కసూర్తాగాంధీ విద్యాలయాలు. కూచిపూడి నృత్యాన్ని తొలుత కొందరికి పరిచయం చేయాలని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, అందరూ ఆసక్తిగా చూపుతుండడంతో అన్ని విద్యాలయాలు అభ్యాసానికి వేదికలుగా మారాయి. కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే ఎక్కువగా నేర్చుకునే కూచిపూడి, భరతనాట్యాన్ని విద్యాశాఖ పేద విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమేరకు ప్రతి బుధ, శనివారాల్లో జూమ్ యాప్ ద్వారా ప్రొజెక్టర్ సాయంతో జనగామ జిల్లాలోని 2,654 విద్యార్థినులకు నృత్యరీతుల్ని నేర్పిస్తోంది.
– దేవరుప్పుల, మార్చి 17
విద్యార్థులకు చదువుతో పాటు వారిలో దాగి ఉన్న నాట్యకళను గుర్తించి వారికి కూచిపూడి నేర్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాట్యం అంటే ప్రతి బాలికకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. కాకపోతే నేర్పే అవకాశం లేక ఎంతోమంది తమ ఆశలను చంపుకుంటున్నారు. ఇది సమయంతో పాటు ఖర్చుతో కూడాని వ్యవహారం. సంపన్న కుటుంబాల పిల్లలు తప్ప పేద విద్యార్థులు పెద్దగా సాహసించరు. అయితే ఈ విషాయాన్ని గమనించిన విద్యాశాఖ కస్తూర్బా పాఠశాలల్లో చదివే బాలికలకు కూచిపూడి, భరతనాట్యం అందుబాటులోకి తేవాలని భావించారు. వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా మొదట నృత్యాన్ని పరిచయం చేశారు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఆసక్తి చూపిన ఫలితంగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.
జనగామ జిల్లాలోని 12 కేజీబీవీ పాఠశాలల్లో 2,654 మంది బాలికలకు కూచిపూడిలో శిక్షణ నిస్తున్నారు. వీరికి ప్రతి బుధ, శనివారాల్లో జూమ్ యాప్ ద్వారా శిక్షణ ఉంటుంది. చరవాణిలో ప్రసారం అవుతున్న ఈ నాట్యకళ అందిరికీ క్లారిటీగా కనిపించేందుకు ప్రొజెక్టర్లు అమర్చి ప్రసారం చేసే వీలు కల్పిస్తున్నారు. ఇందుకు గాను పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో నాట్యం పట్ల కనీస అనుభవం ఉన్న వారిని గుర్తించి జూయ్ యాప్లో ప్రసారమయే నాట్యభంగిమలను విద్యార్థులకు నేర్పిస్తున్నారు. పిల్లల ఆసక్తిని గమనించిన ప్రత్యేకాధికారులు మరింత మమేకమై రికార్డు చేసిన వాటిని మళ్లీ మళ్లీ ప్రదర్శిస్తున్నారు. తీరిక సమాయాల్లో విద్యార్థులు ప్రాక్టీస్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు.
గిరిజన ఎస్సీ బీసీ బాలికలను చేరదీసి వారికి విద్యాబుద్ధులతో పాటు సహ పాఠ్యాంశ ప్రణాళికలో భాగంగా పలు కళలలను విద్యార్థులకు వివరించాలనుకుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా కూచిపూడి నృత్యం నేర్పాలని తలపెట్టింది. ఇందుకు నృత్యరీతులు తెలిసిన ఉపాధ్యాయురాలిని నియమించి యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కస్తూర్బా పాఠశాలల్లో ఆసక్తి ఉన్న బాలికలకు నృత్యాలు నేర్పిస్తోంది.
నాకు చిన్నప్పటి నుంచి నాట్యం అంటే చాలా ఇష్టం. ఏ చిన్న అవకాశం వచ్చినా సెల్ఫోన్లో పాటపెట్టి ఫ్రెండ్స్ ముందు డ్యాన్స్ చేస్తాను. పాఠశాలలో జరిగే వేడుకల్లోనూ ముందే ఉంటాను. ఇప్పుడు పాఠశాలలోనే కూచిపూడి, భరతనాట్యం నేర్పించడం చాలా సంతోషంగా ఉంది. జూమ్ యాప్లో చూసి వారానికి రెండు రోజులు చేస్తున్నాం. తీరిక సమయాల్లో ప్రాక్టీస్ చేస్తున్నా. మాకు దొరికిన ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటాం. మారుమూల తండాల నుంచి వచ్చిన మాకు నాట్యంలో శిక్షణ ఇస్తున్నందుకు అధికారులకు కృతజ్ఞతలు.
– గుగులోత్ సౌమ్య, 10 తరగతి విద్యార్థి
పాఠశాలలో జరిగే పలు వేడుకల్లో వివిధ డ్యాన్సులు చేసే బాలికలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కూచిపూడి నాట్య శిక్షణకు మొగ్గుచూపారు. 20మం ది విద్యార్థులు క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తున్నారు. పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయురాలిని వారికి కేటాయించాం. వారికి మెళకువలు నేర్పుతోంది. ప్రతి బుధ, శనివారాల్లో యాప్ ద్వారా శిక్షణ పొందడమే గాక, దాన్ని రికార్డు చేసి అభ్యాసం చేస్తున్నారు. ప్రభుత్వం మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బాలికలను ఇది మంచి అవకాశం. వారిలో ఉన్న ప్రతిభ వెలికివస్తుంది.
– సుకన్య, ఎస్వో, దేవరుప్పుల