హనుమకొండ, అక్టోబర్ 21: ఈనెల 24 నుంచి 31 వరకు పంజాబ్లోని భటిండా గురుకాశీ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ(పురుషులు, మహిళలు) పోటీలకు విశ్వవిద్యాలయ జట్టును ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు.
ఈ ఎంపికలో ఇండియన్ రౌండ్(పురుషులు): నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన టి.సునీల్కుమార్, రీకర్వ్ రౌండ్ (పురుషులు): హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీకి చెందిన బి.గంగరాజు, తొర్రూరు సమతా డిగ్రీ కాలేజీకి చెందిన చి.త్రిశూల్, భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన ఈ.ఆనంద్, కే.అశ్విత్దొర, రీకర్వ్ రౌండ్ (మహిళలు) వరంగల్ సి.కే.ఎం. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చెందిన తన్వీర్ కౌసర్, కాంపౌండ్ రౌండ్ (మహిళలు) వరంగల్ పద్మావతి డిగ్రీ కాలేజీకి చెందిన మన్సురహ హసిభా, ఈ బృందానికి కోచ్-కమ్-మేనేజర్గా హనుమకొండ న్యూసైన్స్ డిగ్రీ కాలేజీ వ్యాయామ అధ్యాపకుడు పి.రాజేష్ వ్యవహరిస్తారు.