వరంగల్, సెప్టెంబర్ 27 : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా నిర్వహించిన తొలి, మలి దశ ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి ప్రధాత అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కొండా లక్ష్మణ్ బాపూ జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969 తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచి రాష్ట్ర సాధన కోసం దీక్ష చేసి, మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలివేసిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. బాపూజీ స్ఫూర్తితో బీసీల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తున్నదన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఘనత భావితరాలకు తెలిసేలా తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తున్నదన్నారు. ప్రభుత్వం కోకాపేటలో రెండున్నర ఎకరాల స్థలంలో రూ.5 కోట్లతో నిధులతో పద్మశాలీ ఆత్మగౌరవ భవన్ నిర్మిస్తున్నదన్నారు. హైండ్ల్యూం, టెక్స్టైల్ రంగాలకు రూ.338 కోట్లు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేన్నారు. రెండు కార్పొరేష న్లు, 11 ఫెడరేషన్ల ద్వారా బీసీలకు అండగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ, కార్పొరేటర్లు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో బాపూజీ ఆదర్శం : ఎమ్మెల్యే
పోచమ్మమైదాన్: తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ఆచా ర్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ చేసిన పోరాటం అందరికీ ఆదర్శమన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. రానున్న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి లోపు కనీవిని ఎరుగని విధంగా తూ ర్పు నియోజకవర్గంలోని ప్రధాన కూడలి వద్ద ఆయన విగ్రహా న్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్ గోరంట్ల మనోహర్, నాయకులు చిప్న వెంకటేశ్వర్లు, బొల్లు సతీశ్, బేతి అశోక్, పాక సుధాకర్ పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన మేయర్ దంపతులు
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద బాపూజీ విగ్రహానికి నగర మేయర్ గుండు సుధారాణి-గుండు ప్రభాకర్ దంపతులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యమంలో ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. అనంతరం ఆమె స్థానికులకు పండ్లను పంపిణీ చేశారు. జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు ఆడెపు రవీందర్, కో ఆర్డినేటర్ నరేందర్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్, రాజు, చందర్బాబు, సంఘం అధ్యక్షుడు మదనయ్య, విజయ్కుమార్, భద్రయ్య, కొమురయ్య, సంపత్, సంపత్ పాల్గొన్నారు.
ఎల్బీ నగర్ పద్మశాలీ సేవా సంఘం ట్రస్ట్ భవనంలో..
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ట్రస్ట్ అధ్యక్షుడు సుంకనపల్లి శ్రీనివాస్ అధ్యక్షన ఎల్బీనగర్లోని పద్మశాలీ సేవా సం ఘం ట్రస్ట్ భవనంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు గోరంటల రాజు, సుధాకర్, వెంకటేశ్వర్లు, స్వర్గం దశరథ, బీ మురళీకృష్ణ, గాదె ప్రభాకర్, బింగి మహేశ్, బీ సారంగపాణి, కే నాగరాజు, ఎం యెల్లయ్య, వీ నరేందర్, ఏ రవీందర్, కే సతీశ్, వీ వెంకటరమణ పాల్గొన్నారు.