‘సకలజనులను ఏకం చేసి అసాధ్యమనుకున్న ప్రత్యేక తెలంగాణను సాధించారు సీఎం కేసీఆర్. ఉద్యమ సమయం నుంచి నేటివరకూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ రాష్ర్టాన్ని నంబర్ వన్గా నిలబెట్టి దేశం దృష్టిని ఆకర్షించారు. అపార అనుభవం, రాజకీయ చతురత, మేధోశక్తికి తోడు అనుకున్నది సాధించేదాకా పట్టువీడని అతడి నైజమే.. దేశాన్ని కొత్త మార్గంలో నడిపిస్తుంది’ అంటూ పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. కుల, మత, భాషాభేదం లేకుండా అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటూ వారికి వివిధ రంగాల్లో అవకాశాలు కల్పించే కేసీఆర్ లాంటి నాయకుడితోనే దేశం అభివృద్ధి బాట పడుతుందని స్పష్టంచేస్తున్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమంతో పాటు భారత చిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రాంతీయ భాష, యాస, సంస్కృతులు వెలుగులోకి వస్తాయని, అది ఉద్యమనేతతోనే సాధ్యమవుతుందని పలువురు ప్రముఖులు స్పష్టం చేస్తున్నారు. అప్పటివరకు సినిమాల్లో అంతగా పట్టించుకోని తెలంగాణ మాండలికానికి కేసీఆర్ వల్లే ఆదరణ అమాంతం పెరిగి.. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డుల వర్షం కురిపించేలా చేసిందని గుర్తుచేస్తున్నారు. అన్ని వర్గాలనే కాకుండా అన్ని రంగాలను తన అనుభవం, పరిజ్ఞానం, ముందుచూపుతో అభివృద్ధి చేయగల సమర్థుడు కేసీఆర్ అని, ఆయనతోనే దేశం కొత్త ఆవిష్కరణలు చేయగలదని ధీమా వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ సినీ పరిశ్రమలాగా ఎన్నో గొప్పగొప్ప సినిమాలు తీస్తున్న మరాఠి, కొంకణీ, బెంగాలీ, గుజరాతీ, భోజ్పురి, ఒడియా లాంటి మరెన్నో ప్రాంతీయ భాషలు, నటులు జనాదరణ పొందుతారని.. దేశంలో ఉత్తమ ప్రతిభ కలిగి గుర్తింపునకు నోచుకోని ఎంతోమంది కళాకారులు వెండితెర మీద వెలుగుతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 22
ప్రజల శ్రేయస్సు కోరే నాయకుడు
దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని పేదల శ్రేయస్సు కోసం కొత్త కొత్త సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు వ్యవసాయరంగాన్ని పండుగలా మార్చారు. అలాగే కనుమరుగువుతున్న కుల వృత్తులకు, జానపద కళలకు, సాంస్కృతికరంగానికి జీవం పోశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయడంతో పాటు ప్రపంచ తెలుగు మహాసభలు, తెలంగాణ ఆవిర్భావ వేడులు, తెలంగాణ జాతీయ వజ్రోత్సవాలు.. ఇలా అనేక వేడుకల మూలంగా కవులు, కళాకారులకు గుర్తింపు దక్కింది. సబండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించేందుకు అహర్నిషలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రధాని అయితే భారతదేశం సరికొత్తగా మారుతుంది.
– తొట్టే కోమలి, జానపద కళాకారిణి, కేసముద్రం
కేసీఆర్ చొరవ వల్లే చిత్రసీమకు కొత్తకళ
భూపాలపల్లి రూరల్, సెప్టెంబర్ 22 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి భారతదేశంలో కూడా జరగాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. కుల, మత రాజకీయాలు పోవాలంటే కొత్త నాయకత్వం కావాలి. అందుకోసమే దేశ ప్రజలంతా కేసీఆర్ పాలన వైపు చూస్తున్నారు. సమైక్యపాలనలో చిత్ర పరిశ్రమను పట్టించుకున్న వారు లేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ చొరవతోనే చిత్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన సామాన్యులు సైతం నేడు ఇండస్ట్రీలో పనిచేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్ తగిన ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తూ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దేశంలో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ దేశ ప్రధాని అయితేనే అది సాధ్యమవుతుంది. చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుంది.
– శ్రవణ్కుమార్, సినీ పరిశ్రమ డైరెక్టర్, భూపాలపల్లి
తెలంగాణ పౌరులందరికీ గర్వకారణం
ములుగు, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : దేశ రాజకీయాల్లో తెలంగాణ ప్రాంత బిడ్డగా సీఎం కేసీఆర్ వెళ్లడం మనందరికీ గర్వకారణం. 30 ఏళ్ల క్రితం ప్రధాని పీఠం ఎక్కాలంటే జాతీయ పార్టీకి అందించిన సేవల ద్వారా అవకాశం వచ్చేది. కానీ ఇవ్వాళ ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ నుంచి ఒక జాతీయ పార్టీ పెడుతానని ప్రకటించడం ఆయన గుండె ధైర్యానికి నిదర్శనం. ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశం కంటే భిన్నమైన రీతిలో రాజకీయాలు ఉంటాయి. తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేళ్లలోనే దేశంలోనే అగ్రగామిగా నిలిపిన తీరు యావత్ దేశమంతా గమనిస్తూ జాతీయ పార్టీ ప్రకటనతో ఆసక్తికరంగా చూస్తోంది. పోరాడి సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ మన ప్రాంతం నుంచి జాతీయ రాజకీయాలకు వెళ్లడం శుభపరిణామంగా కనిపిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ దక్షిణాది నుంచి జాతీయ పార్టీని స్థాపించి దేశంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరమున్నది.
– పింగిలి నాగరాజు, సామాజికవేత్త, ములుగు
దేశం గర్వించే పథకాలు తెస్తాడు..
నర్సింహులపేట, సెప్టెంబర్ 22 : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రం వలె దేశం గర్వించేలా సరికొత్త పథకాలు తీసుకొస్తారు. భారత్ను ప్రపంచానికే ఆదర్శంగా దేశాన్ని నిలుపుతాడు. తెలంగాణ కళాకారులను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించారు. సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తెలంగాణను ఇవ్వాళ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. నాడు విద్యుత్ తీగలపై బట్టలు అరేసుకునే పరిస్థితి నుంచి 24గంటల పాటు కరెంట్ ఇచ్చే వరకు స్థాయికి తెచ్చి దేశమంతా మన వైపు చూసేలా చేసిన నాయకుడు కేసీఆర్. అలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో కీలకంగా ఉంటే దేశాన్ని ప్రపంచదేశాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతాడన్న నమ్మకం ఉంది.
– దొనికెన గౌతమ్, బుల్లితెర నటుడు
ప్రాంతీయ భాషలకు గౌరవం పెరుగుతుంది
కృష్ణకాలనీ, సెప్టెంబర్ 22 : సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే భారత సినిమా ఇండస్ట్రీలో అన్ని ప్రాంతీయ భాషలకు గౌరవం పెరుగుతుం ది. ఉమ్మడి రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి, భాషకు గౌరవం ఉండేది కాదు. తెలంగాణ నుంచి రైటర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, డైరెక్టర్లు కూడా చాలా తక్కువగా ఉండేవారు. తెలంగాణలో సినిమా షూటింగ్లు కూడా తక్కువగా ఉండేవి. గతంలో మన తెలంగాణ యాస, భాషతో సినిమాలు చాలా తక్కువగా వచ్చేవి. దానికి కారణం తెలంగాణ యాస, భాష, సంస్కృతికి ప్రాధాన్యం, అవగాహన లేకపోవడమే. ప్రత్యేక తెలంగాణ వచ్చాక డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయంపై పూర్తి అవగాహన ఏర్పడింది. షూటింగ్ స్థలాలు కూడా అమాంతం పెరిగాయి. రామప్ప, లక్నవరం, వెయ్యిస్తంభాల గుడి, మానేరు డ్యాం, బొగత వాటర్ఫాల్స్, కొ మురంభీం మ్యూజియం వంటి పురాతన చరిత్రలు కలిగిన స్థలాలను తీసుకొని వాటికి సరిపడా నిధులు విడుదల చేసి ఆ స్థలాలను అన్ని హంగులతో అతి సుందరంగా అభివృద్ధి చేసి ప్రధానమైన టూరిజం స్థలాలుగా తీర్చిదిద్దడం వల్ల నేడు అక్కడ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు కొడుతున్న సినిమా షూటింగ్లు జరుగుతున్నా యి. ఎక్కువమంది సినిమా డైరెక్టర్లు తెలంగాణలోని షూటింగ్ స్పాట్స్నే ఎంచుకొని షూటింగ్లు తీస్తున్నారు. నేడు మన భాష, సంస్కృతికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎనలేని గౌరవం పెరిగింది. ప్రాంతీయ భాష అయినా తెలంగాణ భాషకే డైరెక్టర్లు, ప్రొ డ్యూసర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ యాస, భాషలోనే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. డైరెక్టర్లు కూడా మన యాస, భాషలోనే ఎక్కువ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అప్పటివరకు సినిమాల్లో అంతగా పట్టించుకోని తెలంగాణ మాండలికానికి సీఎం కేసీఆర్ చొరవ తర్వాత అమాంతం ఆదరణ పెరిగింది. రవీంద్రభారతి లాంటి కళావేదికను ఉపయోగించుకోని ఎంతోమంది కొత్త తెలంగాణ నటుల కోసం వెతుకులాట మొదలైంది. ఈ పరిణామం మెల్లగా రెండున్నర గంటల సేపు ఆనందాన్ని పంచే ఆయుధంగా మారింది. తెలంగాణ మాం డలికంతో తెలుగు చిత్రసీమ కనివిని ఎరుగని రీతిలో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి, హిందీ చిత్రసీమ సైతం అవాక్కయ్యేలా చేసింది. తెలంగాణ రాకముందు మన మాండలికం ఎలాంటి దుస్థితిలో ఉండేదో ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని ప్రాంతీయ భాషలు అదే పరిస్థితిలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని ఎన్నో ప్రాంతీయ భాష, యాస, సంస్కృతులు వెలుగులోకి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.
– గండి వెంకటేశ్ గౌడ్, కాశీంపల్లి, సినీ డైరెక్టర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా