కరీమాబాద్, డిసెంబర్ 18: నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. ఆదివారం 40వ డివిజన్లో రూ.50లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మరుపల్ల రవితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతులను కల్పిస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు ఎళ్లవేళలా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను విని భరోసా ఇచ్చారు. డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్, ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎండీ సాదిక్, కోరె కృష్ణ, ఆవునూరి రామ్మూర్తి, ఆవునూరి రామన్న, బాల కొమురెల్లి, వంగరి సురేశ్ పాల్గొన్నారు. కాగా, ఉర్సు హరిజనవాడలో కొత్తగా నిర్మించిన కమ్యూనిటీహాల్ను ఎమ్మెల్యే నరేందర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సబ్ప్లాన్ నిధులతో దళిత వాడలు మోడ ల్ కాలనీలుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ దళితుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం ఉర్సు బొడ్రాయి సమీపంలోని శివాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన మహా ఎమ్మెల్యే పాల్గొన్నారు.
అయ్యప్ప పడిపూజలో..
గిర్మాజీపేట: నగరంలోని 28వ డివిజన్ పిన్నవారివీధిలో స్థానిక కార్పొరేటర్ గందె కల్పన, నవీన్ దంపతుల ఇంట్లో ఆదివారం నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వాణి దంపతులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అయ్యప్పస్వామి చల్లని చూపులతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. గురుస్వాములు సుమన్శర్మ, రాచర్ల జగన్, ఔరుపల్లి శ్రీకాంత్, అకినెపల్లి శ్రీనివాస్, సంతోష్, శ్రీరాముల సురేశ్ ఆధ్వర్యంలో మహాపడిపూజ వైభవంగా నిర్వహించారు. గందె నవీన్ ఇంటి వద్ద (మహా భిక్ష) అన్నదానం నిర్వహించారు. 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్, కార్పొరేటర్ గందె కల్పనా నవీన్ కుటుంబసభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 25న కరీమాబాద్లోని సీతారామస్వామి అయ్యప్ప భక్తమండలి, కరీమాబాద్ కాశీవిశ్వేశ్వర అయ్యప్ప భక్తబృందం ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీన 108 కలశాలతో నిర్వహించే పడిపూజ, మహాఅన్నదానం పోస్టర్లను ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. వ్యవస్థాపక గురుస్వామి కొమ్మిని రాజేందర్, పౌడాల సంపత్కుమార్, యశ్వంత్, కోరె కృష్ణ, నాగరాజు, సురేశ్, సన్ని పాల్గొన్నారు. కాగా, జేపీఎన్ రోడ్డులోని దర్శన్ ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే హాస్పిటల్లో విభాగాను పరిశీలించగా, ఎమ్మెల్సీ కంటి పరీక్షలు చేయించుకున్నారు. గ్లకోమా స్పెషలిస్ట్ బచ్చు సింధు, యూరాలాజిస్ట్ బచ్చు చందుకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నేత బస్వరాజు శ్రీమాన్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
యేసు కృపతో అందరూ బాగుండాలి : ఎమ్మెల్యే నన్నపునేని
ఖిలావరంగల్: యేసయ్య కృపతో అందరూ బాగుండాలని తూర్పు నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం పడమర కోటలో కల్వరి బాప్టిస్ట్ చర్చి నిర్మాణం కోసం మూలరాయి స్థాపనకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయమన్నారు. బాప్టిస్ట్ చర్చి నిర్మాణం కోసం సహకరిస్తామని తెలిపారు. దళిత, గిరిజన బహుజనుల పక్షాన నిలబడుతున్న సెక్యూలర్ పార్టీ బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అన్నారు. అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ఉర్సులో దళిత కాలనీలో నిర్మించిన ప్రారంభించినట్లు చెప్పారు. కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, బీఆర్ఎస్ నాయకులు మేకల ఎల్లయ్య, నలిగంటి అభిషేక్ పాల్గొన్నారు.