వరంగల్ : కల్యాణ లక్ష్మి, షదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు వరం వరంగా మారాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో ఖిలా వరంగల్ మండలానికి చెందిన 193 లద్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నమాట్లాడుతూ.. పేదింట ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు.
నిరుపేద ఆడబిడ్డలకు మేనమామగా మారి గొప్ప సహాయం అందజేస్తున్నారన్నారని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, ఖిలా వరంగల్ మండలానికి చెందిన కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.