చిట్యాల/ టేకుమట్ల, జూలై 25 : ప్రజా సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం పని చేస్తున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం చిట్యాల మండల కేం ద్రంలోని క్యాంపు కార్యాలయం, జడల్పేట జీపీ ఆవరణలో 26 మందికి, టేకుమట్ల మండలకేంద్రంలోని రైతు వేదికలో 22 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ రాజకీయాలకతీ తంగా ప్రజలకు అనే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అంతేకాకుండా సంక్షేమంలో రాష్ట్రం దేశంలో ఉన్నత స్థానంలో ఉందన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ.. అసత్య ఆరోప ణలు చేస్తున్నదన్నారు. కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరం గా మారిందని, రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్కు అండగా ఉం డి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో టేకుమట్ల ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీలు గొర్రె సాగర్, పులి తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు ఆ రెపల్లి మల్లయ్య, సట్ల రవిగౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్య క్షులు కామిడి రత్నాకర్రెడ్డి, గునిగంటి మహేందర్గౌడ్, చిట్యాల పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్రెడ్డి, వైస్ చైర్మన్ ఏరుకొండ గణపతి, పార్టీ మండల ప్రధానకార్యదర్శులు ఏరు కొండ రాజేందర్, సంపత్రావు, ఎంపీటీసీ కట్కూరి పద్మానరేం దర్, కోఆప్షన్ సభ్యులు ఎండీ రాజమహ్మద్, పార్టీ టౌన్ అధ్యక్షు డు బుర్ర శ్రీధర్గౌడ్, నాయకులు చింతల రమేశ్ చింతల సమన్, సర్పంచులు పోలాల సరోత్తంరెడ్డి, ఉమేందర్రావు, మ హేశ్, పండుగ శ్రీను, నెరేళ్ల శ్రీనివాస్, కట్కూరి నర్సింహారెడ్డి, నల్లబెల్లి రవీందర్, రామారావు, మహిపాల్రెడ్డి పాల్గొన్నారు.