కాళేశ్వరం, జూలై 17: కన్నెపల్లి పంప్హౌస్ నుంచి అన్నారం బరాజ్కు కాళ్వేశరం జలాలు తరలిస్తున్నారు. సోమవారం 4 మోటర్ల ద్వారా 8800 క్యూసెక్కుల నీటిని అధికారులు పంపింగ్ చేస్తున్నారు. పంప్హౌస్లో 4,5,6,7వ మోట ర్లను ఆన్ చేశారు. అలాగే అన్నారం బరాజ్కు కాళే శ్వరం జలాలు 8.01 టీఎంసీల నీటిని తరలించి నట్లు ఇంజినీర్లు తెలిపారు.
35 గేట్ల ఎత్తివేత
మహదేవపూర్: మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న లక్ష్మీ బరాజ్లో వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాణహిత నది ద్వారా భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. 1,18, 440 క్యూసెక్కుల వరద ప్ర వాహం రాగా, బరాజ్లోని 84 గేట్లకు 35 గేట్లు ఎత్తి 1,28,556 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ డీఈ ఈ సురేశ్ తెలిపారు. బరాజ్ పూర్తి నీటి నిల్వ సా మర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11.14 టీఎంసీల నీరుందని, ప్రస్తుత నీటి మట్టం బరాజ్ రివర్ బెడ్ నుండి 10.3 మీటర్లగా ఉందని ఆయన వెల్లడించారు. భారీగా వరద నీరు చేర డంతో లక్ష్మీ బరాజ్ నిండు కుండను తలపిస్తోంది.
సమ్మక్క బరాజ్ 18 గేట్లు ఎత్తివేత
కన్నాయిగూడెం: మండలంలోని తూపాకుల గూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి వరద పెరుగుతోంది. సొమవారం ఎగువ నుంచి లక్షా రెండు వేల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో18 గేట్లను ఎత్తి దిగువకు పంపిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి బరాజ్ వద్ద నీటిమట్టం 80 మీటర్లు ఉండేలా గేట్లను ఆపరేట్ చేస్తున్నారు. అదేవిధంగా దేవాదుల ఎత్తి పోతల ప్రాజెక్టులోని ఫేస్ 3 నుంచి రెండు మోట ర్లతో పంపింగ్ కొనసాగుతోంది. రోజుకు రెండు మోటర్ల ద్వారా 583 కూసెక్కుల నీటిని భీంఘ నపురం రిజర్వాయర్లోకి తరలిస్తున్నట్లు డీఈ శరత్, ఏఈఈ సాయిరాం తెలిపారు.