జనగామ చౌరస్తా, నవంబర్ 23: జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది అంశాల్లో పాఠ శాల విద్యార్థులకు ‘కళా ఉత్సవం’ పోటీలు నిర్వ హించారు. బుధవారం ఉత్సాహంగా జరిగిన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడు కలు ప్రారంభించారు. శాస్త్రీయ సంగీత గాత్రం, వాయిద్యాలు, జానపద సంగీత గాత్రం, అభిన యం, నృత్యం, శాస్త్రీయ నృత్యం, చిత్రలేఖనం, శిల్పం బొమ్మల తయారీ, ఏకపాత్రాభినయం పోటీల్లో 83 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ విద్యా ర్థులు చదువుతో పాటు పాటలు, నటన, నృత్యా లు, సంగీతం, వాద్య సంగీతం కళల్లో కూడా ప్రా వీణ్యం సంపాదించాలని అన్నారు. అప్పుడే విద్యా ర్థుల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని, దీనికి ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలని సూ చించారు. సంగీత, సాహిత్య రంగాల్లో జనగామ జిల్లాకు విశిష్ట స్థానం ఉందని కొనియాడారు. తొమ్మిది రకాల కళా రంగాల్లో నిర్వహించిన పోటీ లకు జిల్లాలోని 12 మండలాల నుంచి తరలివ చ్చిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జిల్లా విద్యా శాఖ అధికారి నేతృత్వంలో ముగింపు సమావేశం నిర్వహించి విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేయడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రాము, అకాడమిక్ మా నిటరింగ్ అధికారి బీ శ్రీనివాస్, మల్లికార్జున్, జీ శ్రీనివాసరావు, రాజేందర్, వీరాంజని, రవికుమా ర్, అర్జున్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చదువుతో పాటు కళల్లోనూ రాణించాలి
మహబూబాబాద్ డీఈవో అబ్దుల్ హై
మహబూబాబాద్ రూరల్, నవంబర్ 23 : విద్యార్థులు చదువుతో పాటు కళల్లోనూ రాణిం చాలని జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్ హై అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని గు మ్ముడూరు ప్రభుత్వ బాలికల పాఠశాలలో జిల్లా స్థాయి కళా ఉత్సవం పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డీఈవో హాజరై మాటాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మ కతను వెలికితీసేందు జిల్లా స్థాయి కళా ఉత్సవా లు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. జిల్లాలో ని వివిధ రకాల కళల్లో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారని, ఇందులో ప్రతిభ గల వారిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తామన్నారు. ఈ ఉత్సవాలు విద్యార్థులకు ఒక వరం లాంటిదని, చిన్నప్పటి నుంచే కళల పట్ల ఆసక్తిని పెంచుకో వాలన్నారు. కళలతో మానసిక ఉల్లాసం, విజ్ఞా నంతో పాటు ఉపాధి సైతం లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మందుల శ్రీరా ము లు, సుధాకర్, సదయ్య, హల్యానాయక్, వరద రాజు తదితరులు పాల్గొన్నారు.