వరంగల్ చౌరస్తా, మే 14: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీ సుకుంటున్నది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థా యిలో వైద్య సేవలు అందిస్తున్నది. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎంజీఎం హాస్పిటల్లో సరైన వసతులు లేక సుమారు 15 ఏళ్ల పాటు కార్డియాలజీ సేవలు నిలిచిపోయాయి. స్వరాష్ట్రంలో గుండె శస్త్ర చికిత్సలను తిరిగి ప్రారంభించగా, తెలంగాణ ప్ర భుత్వం చేపట్టిన చర్యలు చికిత్స పొందిన పేదల గుండె చప్పుడు రూపంలో వినిపిస్తున్నా యి.
150 కోట్లతో కేఎంసీలో నిర్మించిన కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పా టు చేసిన కార్డియాలజీ విభాగంలో వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. అవసరమైన వారికి గుండె శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నూరు శాతం సక్సెస్ రేటుతో 27 మందికి గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేశారు. మరో 2458 మందికి యాంజియోగ్రామ్ చేయగా, 528 మందికి స్టెంట్స్ వేశారు. అలాగే సుమారు 20వేలకు పైగా రోగులకు ఓపీ సేవలు అందించామని వైద్యాధికారులు తెలిపారు.
మరింత మెరుగైన వైద్యం అందిస్తాం..
– డాక్టర్ చంద్రశేఖర్, ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్
ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఓపెన్ హార్ట్ సర్జరీలు ప్రారంభించిన అనతికాలంలోనే నూరు శాతం సక్సెస్ రేటులో 27 శస్త్ర చికిత్సలు చేశాం. త్వరలోనే ఈ విభాగాన్ని మరింత మెరుగుపరుస్తాం. ఇందుకు కావాల్సిన అనుమతుల కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. కార్డియాలజీ విభాగంలో పాటు మిగిలిన సూపర్ స్పెషాలిటీ సేవలను సైతం మరింత విస్తరిస్తాం.