హనుమకొండ/ చిల్పూరు, మార్చి 26 : బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్య ర్థి డాక్టర్ కడియం కావ్య మంగళవారం హైదరాబాద్లో పార్టీ అధినేత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ను ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. తనపై నమ్మకంతో వరంగల్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదపడుతాయని పేర్కొన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.