బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో ఉమ్మడి జిల్లా నేతలు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీ రాజయ్య, జడ్పీ అధ్యక్షులు మారేపల్లి సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, అంగోత్ బిందు, కుసుమ జగదీశ్వర్, జక్కు శ్రీహర్షిణి, పాగాల సంపత్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రచించిన ‘వెలుగు నీడ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.
– హనుమకొండ, ఏప్రిల్ 27