స్టడీ సర్కిల్ సెంటర్ల ఏర్పాటుపై హర్షం
గతంలో ఏ ప్రభుత్వం చేయలేదంటున్న ఉద్యోగార్థులు
కృష్ణకాలనీ, జూలై 7 : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 33 స్టడీ సర్కిల్ సెంటర్, 4 సివి ల్స్ స్టడీ సర్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయడంపై ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ పొందుతున్న యువత గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పక్షపాతి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల ప్రకటన చేయలేదని, కనీసం స్టడీ సర్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయలేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు బుర్ర రమేశ్గౌడ్, పార్టీ 23వ వార్డు అధ్యక్షుడు ప్రేమ్కుమార్, జీఎంఆర్ఎంలో శిక్షణ పొందుతున్న వారు పాల్గొన్నారు.