జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన సిద్ధి గణేష్ ( 17) అనే బాలుడు స్నేహితులతో కలిసి ఈత నేర్చుకునేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.
ఈ క్రమంలో ప్లాస్టిక్ క్యాన్కు తాడు కట్టి ఈత నేర్చుకుంటుండగా ప్రమాదవశాత్తు బావిలో మునిగి గణేష్ మృతిచెందాడు. గణేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.