జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం మోరంచ పల్లి గ్రామంలో నరెడ్ల సుధాకర్ రెడ్డి (30) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. ఏడాది క్రితం సుధాకర్ రెడ్డి లారీ కొనుగోలు చేశాడు. లారీ సక్రమంగా నడవకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన సుధాకర్ రెడ్డి బుధవారం ఉదయం తన లారీకి ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతునికి భార్య మమత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.