జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య తో గొడవపడి భర్త దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. జమ్మికుంట మండలం బేతిగల్లు గ్రామానికి చెందిన అంబాల రమేష్( 29) ఆరు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోగా ఆమెకు పిల్లలు కాకపోవడంతో రుద్రారం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మిని రెండు సంవత్సరాల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు.
కొన్ని రోజుల నుంచి ఆమెకు అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానం పెంచుకొని తరచూ ఆమెతో గొడవకు పాల్పడేవాడు. శనివారం మధ్యాహ్నం కూడా వారి భర్తల మధ్య గొడవ జరిగింది. కాగా, ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న రమేష్ విచక్షణా రహితంగా రాజ్యలక్మి చేతుల కత్తితో గాయపరిచి పారిపోయాడు.
ఉదయం 6 గంటల సమయంలో రూమ్ ఓనర్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర రక్తస్రావమై కొన ఊపిరితో ఉన్న రాజ్యలక్ష్మిని ములుగు దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.