మల్హర్, ఫిబ్రవరి 25 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్లలో మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య ఆధ్వర్యంలో టీయూఎఫ్ ఫోరం నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్టుకార్డులను పోస్టు చేశారు. తాడిచెర్ల పోస్టుపీస్ నుండి సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు వేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్ మాట్లాడాతూ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేలు ఫించన్ ఇవ్వాలన్నారు.
ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల బడ్జెట్ కెటాయించాలని ఉచిత బస్సు, ట్రైన్ పాసులివ్వాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యమ కారులను విస్మరించిందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మానిఫేస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి బోయిని రాజయ్య యాదవ్, మండల అధ్యక్షులు బూడిద సతీష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్ పాషా, నాయకులు కోండ్ర సారయ్య, బడితెల వెంకటస్వామి, కోట చంద్రమౌళి గౌడ్, అవిర్నేని పురుషోత్తం రావు, ఆకుల సదానందం, గట్టయ్య, జునగరి పద్మ, ముద్దుల విజయ, కుర్రి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.