జయశంకర్ భూపాలపల్లి : నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి. యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని భూపాలపల్లి డీఎస్పీ ఏ. రాములు హెచ్చరించారు. శుక్రవారం భూపాలపల్లి డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నకిలీ విక్రయదారుల పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో పాటు , షీట్ కూడా ఓపెన్ చేస్తామన్నారు.
గుట్కా రవాణా, విక్రయదారుల పై కూడా షీట్ తెరిచి, పి.డి. యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామన్నారు. దొంగతనాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. పెట్రోలింగ్ బీట్లను పెంచామని ఆయన పేర్కొన్నారు. పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కట్టడి చేస్తున్నాం. పాత నేరస్తుల కదలికలపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.