భూపాలపల్లి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : పేద బాలికల కోసం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి ఇంటర్ విద్యను ప్రవేశపెట్టింది. అలాగే ఉద్యోగ సాధనకు ఇంటర్లో మల్టీ పర్పస్ హెల్త్ వర్క (ఎంపీహెచ్డబ్ల్యూ)ర్ కోర్సును సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లాలో మొత్తం 11 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఏడు కేజీబీవీల్లో, మహదేవపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీహెచ్డబ్ల్యూ వృత్తి విద్యా కోర్సును ప్రవేశపెట్టింది. మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు, పలిమెల మండలం పంకెన, మల్హర్ మండలం దబ్బగట్టు, రేగొండ, చిట్యాల, మహాముత్తారం మండల కేంద్రాల్లోని కేజీబీవీల్లో ఇంటర్లో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సును ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 251 మంది, మహదేవపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 45 మంది అభ్యసిస్తున్నారు.
పేద బాలికలకు ఎంతో ప్రయోజనం..
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్లో ప్రవేశపెట్టిన ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు పేద బాలికలకు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తుంది. ఈ కోర్సు రెండు సంవత్సరాలు అభ్యసించాల్సి ఉంటుంది. ప్రథమ చికిత్స, ఇంజక్షన్ చేయడం, స్లైన్ పెట్టే విధానం, బీపీ చెక్ చేయడం, ప్రైమరీ ట్రీట్మెంట్ చేసే విధానాన్ని ఈ కోర్సులో నేర్పిస్తాం. ప్రతి సంవత్సరం నాలుగు నుంచి ఆరు వారాలకు తగ్గకుం డా విద్యార్థినులకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, జిల్లా దవాఖానలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నాం.
పేద విద్యార్థులకు ఎంతో మేలు.. కుమ్మరి రాజేశ్వరి, కేజీబీవీ పంకెన,పలిమెల మండలం
కేజీబీవీల్లో చదువుకుంటున్న నాలాంటి పేద విద్యార్థులకు ఈ కోర్సు ఎంతో మేలు చేస్తుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 500 మార్కులకు 450 సాధించాను. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ కోర్సుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
ఇష్టంతో ఈ కోర్సును ఎంచుకున్నా.. డీ పూజిత, కేజీబీవీ, చిట్యాల
నర్సింగ్ సేవలపై ఇష్టం ఉండడం వల్లే ఈ కోర్సును ఎంచుకున్న. ఇలాంటి కోర్సు చేయాలంటే పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా ఊరి దగ్గర్లోని కేజీబీవీలోనే ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు చదవడం సంతోషంగా ఉంది. నర్సింగ్ జాబ్ సాధించి రోగులకు సేవ చేయడమే నా ప్రధాన లక్ష్యం.