జయశంకర్ భూపాలపల్లి : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు, మత్తడి పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిర్వాసితులను సహాయ చర్యలు అందించడంలో అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ముంపు బాధిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలక తరలించి ఆహార పదార్థాలు అందిస్తున్నారు. కాగా, పలిమేల మండల కేంద్రంలోని 330 మంది నిర్వాసితులను గురువారం రాత్రి పెడగపల్లి ఆశ్రమ పాఠశాలకు అధికారులు తరలించారు. అలాగే పంకెన లో 110, ముకునూర్ 130, లెంకలగడ్డలో 65 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు.