జయశంకర్ భూపాలపల్లి : జీఎంఆర్ ట్రస్ట్ ద్వారా నిరుద్యోగులకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రూప్స్, టెట్, కానిస్టేబుల్, ఎస్ ఐ ఉద్యోగాలకు శిక్షణ కోసం 471 దరఖాస్తులు వచ్చాయన్నారు. హన్మకొండ కు చెందిన జయశంకర్ స్టడీ సెంటర్ ఫాకల్టీచే శిక్షణ ఇప్పిస్తున్నామని, శిక్షణ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రమణారెడ్డి కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి , మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట రాణి తదితరులు పాల్గొన్నారు.