జయశంకర్ భూపాలపల్లి : మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొచ్చారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు.
డిజిటల్ విద్యా బోధనను మెరుగు పరచాలనే సంకల్పంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సేవ్ ది చిల్డ్రన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని భూపాలపల్లి ZPHS పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలో దాదాపు 10పాఠశాలను ఎంచుకోవడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. కరోనా తరువాత విద్యారంగం చాలా వెనుకబడిపోయిందన్నారు.
సీఎం కేసీఆర్ నూతన ఆలోచన విధానాలతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాలను ఎన్నిక చేసి ఇంతటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మంచి పరిణామం అన్నారు.
భవిష్యత్లో డిజిటల్ తరగతుల ఏర్పాటు కోసం నా వంతు సహాయం అందిస్తానని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జెడ్పీ వైస్ చైర్మన్ కల్లెపు శోభ, మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సెగ్గం వెంకట రాణి, కొత్త హరిబాబు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, డీఈవో రాజేందర్, ఎంపీడీఓ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.