చిట్యాల: గ్రామదేవతల అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలతో తలతూగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఏలేటిరామయ్యపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామదేవతల ప్రతిష్ఠాపన వేడుకలకు వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతితో కలిసి హజరయ్యారు. ప్రతిష్ఠించిన శ్రీ భూదేవి, శ్రీ లక్ష్మి సమేత నాభిశిల బొడ్రాయి, పోచమ్మతల్లి విగ్రహాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, గండ్ర దంపతులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ..గ్రామదేతల అశీస్సులు ఎల్లవేళల గ్రామంపై ఉండి పాడిపంటలు, పశుసంపద పెంపొంది ప్రజలు ఆయురాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గ్రామంలో పూర్తిస్థాయిలో నిర్మించబోతున్న ఆంజనేయస్వామి ఆలయానికి తమ వంతుగా సాయం చేస్తామని గండ్ర దంపతులు గ్రామస్తుల సమక్షంలో హామీ ఇచ్చారు. ఆడపడుచుల మంగళనీరాజనాలతో అంగరంగ వైభవంగా నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల్లో కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు.
గ్రామంలో గ్రామస్తులందరికి దేవాతాముర్తుల పేరు మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోదావీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రెసాగర్, స్థానిక సర్పంచ్ ఏలేటి సరోజనలింగారెడ్డి, ఎంపీటీసీ కట్కూరి పద్మ, టీఆర్ఎస్పార్టీ మండలాధ్యక్షుడు ఆరెపెల్లి మల్లయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఏరుకొండ గణపతి, సర్పంచ్ పూర్ణ చందర్రావు, కోఆప్షన్ మెంబర్ రాజమహ్మద్, నాయకులు, నిర్వహణ కమిటి సభ్యులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.