జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరు గ్రామంలో PACS భవన నిర్మాణానికి శుక్రవారం శంకస్థాపన చేశారు. అనంతరం
గణపురం చెరువులో చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు.
సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే మత్స్యకారుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.