భూపాలపల్లి : భూపాలపల్లి పట్టణంలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ డయాగ్నస్టిక్ సెంటర్ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సోమవారం ప్రారంభించారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువధరలకే ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆయన ఈ సందర్భంగా డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులను కోరారు. సూరం అనిల్కుమార్ మాట్లాడుతూ హన్మకొండ పట్టణానికి వెళ్లాల్సిన అవసరం రాకుండా ఇక్కడే అన్ని రకాల పరీక్షలు నిర్వహించేలా అత్యాధునిక డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంటకరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీఆర్ఎస్ అర్భన్ అధ్యక్షులు కటకం జనార్ధన్ , కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.