జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో కోటి ఇరవై అయిదు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణపురం మండలానికి సంబంధించిన కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్. చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణలోని రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.