జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరంలోని గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద ఓ యువతి వరదలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం చెన్నై కి చెందిన జై ప్రియ అనే మహిళ శ్రావణ శుక్రవారం తొలిరోజు కాళేశ్వరం పుష్కర ఘాట్లో పుణ్యస్నానం ఆచరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. నదిలో పడి కొట్టుకు పోతున్న సదరు మహిళను స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చడంతో
నది వద్ద అంతా ఊపిరి పీల్చుకున్నారు.