కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం (సరస్వతి) బరాజ్ లో 01 గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈమేరకు బుధవారం గోదావరి నుంచి 1144 క్యూసెక్కులు, మానేరు నది నుంచి 1000 క్యూసెక్కులు కలిపి మొత్తం 2144 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అలాగే ప్రాజెక్టులోని 01 గేటు ను ఎత్తి 450 క్యూసెక్కులను ఔట్ ఫ్లో వదులుతున్నట్లు పేర్కొన్నారు. బరాజ్లో 10.87 టీఎంసీ నీరుకు గాను 09.21 టీఎంసీ నీరు ఉన్నట్లు తెలిపారు.