శాయంపేట: జిల్లాలో కరోనా కొత్త కేసులు బయటపడుతున్నాయి. మండలకేంద్రంలోని పీహెచ్సీలో శుక్రవారం 160 మందికి కరోనా వ్యాక్యిన్ వేసినట్లు వైద్యులు తెలిపారు. అలాగే, 69 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయగా, 21 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. పత్తిపాకలో 9, కొత్తగట్టుసింగారంలో 2, శాయంపేటలో 1, వసంతాపూర్లో 3, గట్లకానిపర్తిలో 4, మైలారంలో 1, కాట్రపల్లిలో ఒకరికి పాజిటివ్గా తేలింది. అలాగే, మండల పరిధిలోని తొమ్మిది సబ్సెంటర్లో 40 మందికి కరోనా టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు చెప్పారు. అంతేకాకుండా మండలంలోని సూరంపేటలో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, డీఎంహెచ్వో మధుసూదన్ ఆదేశాలతో కరోనా వైద్య శిబిరం నిర్వహించినట్లు వైద్యాధికారి నాగశశికాంత్ తెలిపారు. 107 మందికి టెస్టులు చేయగా, 20 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. గ్రామంలో పాజిటివ్ కేసుల సంఖ్య 25కు చేరిందన్నారు. శిబిరంలో హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు వనిత, సునీత, 104 సిబ్బంది కుమారస్వామి, ధర్మరాజు, కవిత, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
పర్వతగిరి మండలంలో 31..
పర్వతగిరి: మండలంలో శుక్రవారం 31 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పీహెచ్ఎన్ సుజాత తెలిపారు. మండలంలోని వడ్లకొండలో 2, దౌలత్నగర్ 1, ఇస్లావత్తండా 2, కల్లెడ 1, చింతనెక్కొండ 1, ఏబీతండా 1, పెద్దతండా 2, మూడు ఎత్తుల తండా 3, మూడుతండా 1, గోపనపెల్లి 1, ఏనుగల్లులో 1 పర్వతగిరిలో 15 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. అలాగే, 200 మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు.
సంగెంలో 21 మందికి పాజిటివ్..
సంగెం: మండలంలోని సబ్ సెంటర్లలో కరోనా పరీక్షలు చేస్తున్నట్లు పీహెచ్సీ వైద్యాధికారి పొగాకుల అశోక్ తెలిపారు. గ్రామాల్లోనే టెస్టులు చేస్తున్నట్లు సర్పంచ్లు, ఎంపీటీసీలు దండోరా ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరారు. శుక్రవారం మొండ్రాయి, గవిచర్ల, కాపులకనపర్తి, తీగరాజుపల్లిలో పరీక్షలు చేశామన్నారు. మొత్తం 173 మందికి పరీక్షలు చేయగా, 21 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఎల్గూర్రంగంపేట, పల్లార్గూడ, కాట్రపల్లిలోనూ త్వరలోనే టెస్టులు చేస్తామని డాక్టర్ అశోక్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈషా రెబ్బా హాట్ పోజు.. శరీరాన్ని ఇంద్ర ధనస్సులా తిప్పేసిన తెలుగమ్మాయి
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు.. రూ .30,55,490 సీజ్