జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పలిమెల- కామన్ పల్లి ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పలిమెల మండల కేంద్రానికి అనుబంధ గ్రామమైన కామన్పల్లి గ్రామానికి చెందిన కుర్షం సాంబశివరావు మృతుడు( 22), మరో ఇద్దరు వ్యక్తులు కలిసి కాటారంలో ట్రాక్టర్ రిపేరింగ్ కోసమని వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు.
పలిమెల దాటినా తరువాత ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. కుర్షం సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.