జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల వరద ఉధృతికి రోడ్లు తెగిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడుతున్నాయి. కాగా, చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలో మారేళ్ల రఘుపతి రెడ్డి అనే రైతుకు చెందిన గడ్డివాము పిడుగుపాటుకు పూర్తిగా దగ్ధమైంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.