చిట్యాల: లబ్ధిదారులకు పోడు భూమి హక్కులపై అవహగాన కలిగి ఉండాలని డీఆర్డీవో పురుషోత్తం అన్నారు. సోమవారం మండలంలోని కాల్వపల్లి, వెంచరామి, చైన్పాక గ్రామల కేంద్రంగా అందుకుతండా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పోడుభూముల హక్కులకు దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ..గ్రామాల్లోని గిరిజన పోడుభూములు దున్నుకుంటున్న రైతులు ఆర్ఓఎఫ్ఆర్ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించినట్లు తెలిపారు. లబ్దిదారులు ఉచితంగా అందజేస్తున్న ఫారం ఏవిధంగా నింపాలి, నింపిన ఫారాన్ని జిల్లా కమిటికి ఎలా చేరవేస్తారు..? వాస్తవ హక్కు దారులు ఎవరు..? అనే అంశాలపై సమీక్షలో చర్చించారు.
అనంతరం చైన్పాక గ్రామంలో నిర్మిస్తున్న బృహత్ పల్లె ప్రకృతి నిర్మాణ పనులను పరిశీలించి త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎవెన్యూ ప్లాంటేషనల్లో భాగంగా సర్పంచ్ రేణికుంట్ల స్వరూపతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామరావు, ఎంపీడీవో రామయ్య, సర్పంచులు సిద్దంకి భాస్కర్, కచ్చు మల్లేష్, పులి సునిత, ఎంపీటీసీ భుక్య సుజాత, పప్పుల విజయలక్ష్మి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మోహిన్ అలీ, బీట్ ఆఫీసర్లు కృష్ణ, విజయ తదితరులు పాల్గొన్నారు.