చిట్యాల: ఉపాధిహామీ పనుల్లో భాగంగా చేపడుతున్న నర్సరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఏపీవో అలీంపాషా సూచించారు. శుక్రవారం మండలంలోని నైన్పాక, అందుకుతండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న వన్ జీపీ వన్ నర్సరీలను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ..ఎక్కువ మంది కూలీలను నర్సరీ పనులకు తీసుకవచ్చి పాల్థిన్ సంచులను ఎర్ర మట్టి మిశ్రమంతో నింపి వారం రోజుల్లో పూర్తి చేయాలని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఇప్పటి వరకు నింపిన బ్యాగులలో గ్రామంలో తీసుకున్న టార్గెట్ ప్రకారం జామ, మలబార్, వేప, నిమ్మ మొదలగు విత్తనాలను వాటిలో నింపాలని చెప్పారు. ఆయన వెంట సర్పంచులు సిద్దంకి భాస్కర్, తొట్ల లక్ష్మిఐలయ్య, పంచాయతీకార్యదర్శులు సాదిక్, విష్ణు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.