మహదేవపూర్, డిసెంబర్ 28: మిషన్ భగీరథ నీటిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బన్సోడ రాణీబాయి పేర్కొన్నారు. మంగళవారం సూరారంలో మిషన్ భగీరథ నీటిపై అవగాహన కల్పించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి నల్లా బిగించారని అన్నారు. ప్రతి రోజు పరిశుభ్రమైన నీటిని సరఫరా చేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుడాల అరుణ, ఎంపీడీవో శంకర్, మిషన్ భగీరథ వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీరు శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిర్మల, సూరారం సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం పరిశీలన
సూరారం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ బన్సోడ రాణీబాయి పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేలా నిర్వాహకులు కృషి చేయాలని ఎంపీపీ సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుటాంమని హెచ్చరించారు.