సందర్శనార్థం జేఎన్ఎస్కు మృతదేహం
పోచమ్మకుంట శ్మశాన వాటికలోముగిసిన అంత్యక్రియలు
పలువురు క్రీడాకారుల నివాళి
ఆయన మృతి తీరని లోటు
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్
హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 27: అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ సీనియర్ క్రీడాకారుడు, భారత తొలి అర్జున అవార్డు గ్రహీత జమ్మలమడక పిచ్చయ్యకు క్రీడాకారులు, క్రీడాభిమాను లు తుది వీడ్కోలు పలికారు. ఆదివారం కరుణా పురంలో అనారోగ్యంతో ఆయన కన్నుమూయ గా, సోమవారం సందర్శనార్థం పార్థివదేహాన్ని హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి తీసుకువచ్చారు. అనంతరం పోచమ్మకుంటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ‘పిచ్చయ్య అమర్ హై’ అంటూ చివరిసారిగా వీడ్కోలు చెప్పారు.
జేఎన్ఎస్లో పలువురి నివాళి
జేఎన్ఎస్లో ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పిచ్చయ్య మృతదేహం వద్ద పలువురు నివాళులర్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, క్రీడాకారులు ఆయన మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించా రు. అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ పిచ్చయ్య మృతి తీరని లోటన్నారు. ఆయన వరంగల్కు చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సాట్ డిప్యూటీ డైరెక్టర్(టెక్నికల్) సోటాల ధనలక్ష్మి, తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్యామల పవన్కుమార్, హెచ్సీఏ కార్యదర్శి శ్రీనివాస్, హ్యాండ్బాల్ కోచ్ బొడ్డు విష్ణువర్ధన్, పీడీలు టీ గ్రేసమ్మ, ప్రభాకర్, కుమార్, సోమన్న, రిటైర్డ్ డీవైఎస్వో శివకుమార్, సంజీవ్, బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు, క్రీడా సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.