దేవరుప్పుల, డిసెంబర్ 25; ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులందరినీ పాస్ చేయడం హర్షణీయమని టీఆర్ఎస్వీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ సర్కిల్లో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. సంఘం మండల అధ్యక్షుడు పందెనబోయిన మధు ముదిరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇంటర్ విద్యార్థులకు మేలు జరిగిందన్నారు. కరోనా వల్ల విద్యా సౌకర్యాలు అందని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సర్కారు చేయూతనివ్వడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ మండల ప్రధాన కార్యదర్శి రేషపల్లి భాను చందర్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు బానోతు నవీన్నాయక్, ఉపాధ్యక్షుడు యాకూబ్ పాషా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాచర్ల బాబు, యూత్ నాయకులు గుండె రమేశ్, కాముని నర్సింహస్వామి, కొమ్ము సాయి, కారుపోతుల రాజు, దేవరుప్పుల గ్రామ యూత్ అధ్యక్షుడు అంబాల యాకన్న, సోమేశ్, వెంకటేశ్, నరేశ్, నవీన్, కిరణ్, మనోజ్, పాండు తదితరులు పాల్గొన్నారు.