కొద్ది నెలల నుంచి వానలతో దెబ్బతిన్న రహదారులు
41 రోడ్ల మరమ్మతుల కోసం ప్రతిపాదనలు
టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు సన్నాహాలు
ఎస్టిమేట్స్ తయారు చేసే పనిలో పీఆర్ ఇంజినీర్లు
త్వరలో ప్రారంభం కానున్న బీటీ రెన్యువల్ పనులు
వరంగల్, జనవరి 23(నమస్తేతెలంగాణ) : కొద్ది నెలల నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలోని గ్రామీణ రోడ్లు దెబ్బతిన్నాయి. వరదలతో ఈ రోడ్లపై ఉన్న బీటీ లేచిపోవడంతో గుంతలు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల కోతకు గురై అధ్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న గ్రామీణ రోడ్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాలతో మెయింటనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్(ఎంఆర్ఆర్) కింద మరమ్మతులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనల ప్రకారం జిల్లాలో 41 రోడ్ల మరమ్మతుల కోసం రూ.29.07 కోట్లు కేటాయిస్తూ పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. ఈ నిధులను గ్రామీణ రోడ్ల మరమ్మతులకు మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. వెంటనే ఎస్టిమేట్స్ వేసి నిధులు మంజూరైన రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో రోడ్ల మరమ్మతుల కోసం ఎస్టిమేట్స్ తయారు చేసేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఎస్టిమేట్స్కు టెక్నికల్ సాంక్షన్ పొంది టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభించనున్నారు. బీటీ రెన్యూవల్తో ఈ రోడ్లు కొత్తరూపు సంతరించుకోనున్నాయి.
మరమ్మతులు జరిగే రోడ్లు ఇవే..
చెన్నారావుపేట మండలంలో అమీనాబాద్ నుంచి గొల్లభామతండా రోడ్డుకు రూ.69 లక్షలు, పాపయ్యపేట నుంచి ఎర్రగడ్డతండా రోడ్డుకు రూ.17లక్షలు, ధర్మతండా రోడ్డుకు రూ.16లక్షలు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి అయోధ్యపురం రోడ్డుకు రూ.51.63లక్షలు, బోజెర్వు నుంచి పుల్లయబోడుతండా రోడ్డుకు రూ.45.05లక్షలు, దుగ్గొండి మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి శివాజీనగర్ రోడ్డుకు రూ.1.08 కోట్లు, లక్నేపల్లి నుంచి మల్లంపల్లి రోడ్డుకు రూ.40.80లక్షలు, ఖానాపురం మండలంలో బుధరావుపేట నుంచి ధర్మారావుపేట రోడ్డుకు రూ.59.40లక్షలు, ఖానాపురం నుంచి రంగాపురం రోడ్డుకు రూ.81.55లక్షలు, ఖానాపురం నుంచి హరిజనవాడ మీదుగా జడ్పీ రోడ్డు వరకు రూ.10.23లక్షలు, ఖానాపురం నుంచి ఆయకట్టు రోడ్డుకు రూ.16.80లక్షలు, పెద్దమ్మగడ్డ నుంచి మనుబోతులగడ్డ రోడ్డుకు రూ.26.70లక్షలు, నల్లబెల్లి మండలంలో బోల్లోనిపల్లి నుంచి ముచ్చింపులతండా రోడ్డుకు రూ.48లక్షలు, మేడపల్లి నుంచి లైన్తండా మీదుగా కొండాపూర్ రోడ్డుకు రూ.102.60లక్షలు, నర్సంపేట మండలంలో ఆర్అండ్బీ రోడ్డు నుంచి అశోక్నగర్ వరకు రూ.60.60లక్షలు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి లైన్తండా రోడ్డుకు రూ.53లక్షలు, నెక్కొండ మండలంలో తోపనపల్లి నుంచి బొల్లికొండ రోడ్డుకు రూ.31.90లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి నెక్కొండతండా వరకు రూ.8.60లక్షలు, రెడ్లవాడ నుంచి బడికిందితండా రోడ్డుకు రూ.24.40లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. రాయపర్తి మండలంలో వాంకుడోత్ తండా నుంచి బానోత్ తండా వరకు రూ.60లక్షలు, తిరుమలాయపల్లి క్రాస్రోడ్డు నుంచి రామవరం రోడ్డుకు రూ.1.38కోట్లు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి సూర్యతండా వరకు రూ.75లక్షలు, కొండాపూర్ క్రాస్రోడ్డు నుంచి సూర్యతండా వరకు రూ.91లక్షలు, ఊకల్ క్రాస్రోడ్డు నుంచి బాలాజీతండా వరకు రూ.28లక్షలు, కొండూరు నుంచి మురిపిరాల వరకు రూ. 1.55కోట్లు, ఊకల్ నుంచి కొండాపురం వరకు రూ.25లక్షలు కేటాయిస్తూ పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. గీసుగొండ మండలంలో గీసుగొండ నుంచి మొగిలిచర్ల క్రాస్రోడ్డు వరకు రూ.95లక్షలు, పోతరాజుపల్లి నుంచి గీసుగొండ వరకు రూ.89.60లక్షలు, గీసుగొండ నుంచి మచ్చాపూర్ వరకు రూ.87లక్షలు, సంగెం మండలంలో నర్సంపేట రోడ్డు నుంచి పల్లారుగూడ వరకు రూ.96.50లక్షలు, కాట్రపల్లి నుంచి వెంకటాపురం వరకు రూ.83లక్షలు, గుంటూరుపల్లి నుంచి బొల్లికుంట వరకు రూ.59లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కొత్తగూడెం వరకు రూ.26.50లక్షలు ప్రభుత్వం కేటాయించింది. పర్వతగిరి మండలంలో కల్లెడ నుంచి ముంజాలకుంటతండా వరకు రూ.4.30 కోట్లు, పర్వతగిరి నుంచి చింతనెక్కొండ వరకు రూ.1.64 కోట్లు, దౌలత్నగర్ నుంచి చెరువుకొమ్ముతండా వరకు రూ.54లక్షలు, ఏనుగల్ నుంచి బుచ్చతండా వరకు రూ.60లక్షలు, పీఆర్రోడ్డు నుంచి మంగలితండా వరకు రూ.12లక్షలు, వర్ధన్నపేట మండలంలో ఇల్లంద నుంచి రామ్నగర్ వరకు రూ.67లక్షలు, బొల్లికుంట క్రాస్రోడ్డు నుంచి చెన్నారం మీదుగా ఉప్పరపల్లి వరకు రూ.71లక్షలు, డీసీతండా నుంచి ల్యాబర్తి వరకు రూ.69 లక్షలు మంజూరు చేసింది.