ముందస్తు మొక్కులతో కిక్కిరిసిన మేడారం
సుమారు 80 వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారుల వెల్లడి
తాడ్వాయి, జనవరి21: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో మేడారం పరిస రాలు కిక్కిరిసిపోతున్నాయి. మహాజాతర సమీపిస్తుం డడంతో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేసి, తలనీలాలు సమర్పిస్తున్నారు. అ నంతరం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడి ద్ద రాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, వ స్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదా య పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు లు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం సుమారు 80 వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే అరూరి
వరాలిచ్చే దేవతలు సమ్మక్క-సారలమ్మలను వర్ధ న్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ని బీజాపూర్ ఎంపీ దీపక్ బాయిజ్ కుటుంబ సమే తంగా దర్శించుకున్నారు. అమ్మవార్లకు ఎత్తుబెల్లం సమర్పించేందుకు తులాభారం వేయించుకుని నెత్తిన బెల్లం పెట్టుకుని వన దేవతల దర్శనానికి వెళ్లారు. వా ళ్లకు దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు స్వాగతం పలికి తల్లుల గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. అమ్మ వార్ల గద్దెలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొ క్కులు చెల్లించుకున్నారు.
మేడారంలో టెంట్ సిటీ
వనదేవతల జాతరలో సకల సౌకర్యాలతో ఆకర్షణీయంగా టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నా రు. మేడారం మహాజాతర నాలుగు రోజుల పాటు కోటిమంది భక్తులతో అంగ రంగ వైభవంగా జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి భక్తు లు వచ్చి మేడారం జాతర పరిస రాల్లో విడిది చేస్తారు. నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలు తడకలతో ఏర్పాటు చేసే లాడ్జిల్లో గదులను అద్దెకు తీసుకుని ఉంటారు. కాస్త సంపన్న వర్గాలకు చెందిన వారు అన్ని సౌకర్యాలు ఉన్న గదులను అద్దెకు తీసుకుంటారు. అలాంటి వారి కోసం మేడారంలో అమ్మవా ర్ల గద్దెల సమీపంలో టెంట్ సిటీని ప్రైవేటు వ్య క్తులు ఏర్పాటు చేస్తున్నారు. అటాచ్డ్ బాత్రూం, సింక్ను ఏర్పాటు చేస్తున్నారు. అందమైన గదులతోపాటు గద్దెలకు సమీపంలో నిర్మిస్తుండ డం భక్తులను ఆకర్షిస్తున్నది.